2022
పతనము దేవుని యొక్క ప్రణాళికలో భాగమైయున్నది
2022 జనవరి


“పతనము దేవుని యొక్క ప్రణాళికలో భాగమైయున్నది,” లియహోనా 2022 జనవరి

లియహోనా నెలవారీ సందేశము, 2022 జనవరి

పతనము దేవుని యొక్క ప్రణాళికలో భాగమైయున్నది

పతనం కారణంగా, మనం భూమిపైకి వస్తాము మరియు ఒక రోజు పరలోకంలో మన తండ్రితో కలిసి జీవించడానికి తిరిగి వెళ్ళగలము.

చిత్రం
ఆదాము హవ్వలు

ఏదెను తోటలో ఆదాము హవ్వలు, రాబర్ట్ టి. బారెట్ చేత

ఏదెను తోటలో, దేవుడు ఆదాము మరియు హవ్వ‌లను మంచి మరియు చెడుల జ్ఞానం యొక్క చెట్టు ఫలాలను తినవద్దని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆయన వారితో ఇలా అన్నారు, “నీకు నీవే ఎంచుకొనుము, … కానీ వాటిని నేను నిషేధించితిని” (మోషే 3:17). చెట్టు యొక్క పండును తినమని సాతాను హవ్వను శోధించాడు. అతడు ఆమెతో, “మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురు” (మోషే 4:11) అని చెప్పాడు. ఆమె పండును తిని తరువాత ఆదాముతో పంచుకుంది. దేవుడు వారిని ఏదెను తోటనుండి పంపివేసారు.

పతనము

చిత్రం
ఆదాము హవ్వలు

ఏదెను తోటలో ఆదాము హవ్వలు, గ్యారీ ఎల్. కాప్ చేత, కాపీ చేయబడకపోవచ్చు

ఆదాము హవ్వలు ఏదెను తోటను విడిచిపెట్టినప్పుడు, వారిక దేవుని సన్నిధిలో లేరు. దేవుని నుండి ఈ విభజనను ఆత్మీయ మరణం అంటారు. తోటను విడిచిపెట్టడం అంటే ఆదాము హవ్వలు మర్త్యులుగా మారారు మరియు తద్వారా మరణించగలిగారు. ఆదాము హవ్వలు ఇకపై దేవునితో లేరు మరియు ఇప్పుడు మర్త్యులుగా ఉన్నప్పటికీ, వారు అభివృద్ధి సాధించగలరని చూసినప్పుడు వారు సంతోషంగా మరియు ఆశతో ఉన్నారు (మోషే 5:10–11 చూడండి). “మనుష్యులు ఉనికిలోనికి వచ్చునట్లు, వారు సంతోషమును కలిగియుండునట్లు ఆదాము పతనమాయెను” (2 నీఫై 2:25).

పరీక్ష సమయం

మనం పుట్టినప్పుడు, పతనం తర్వాత ఆదాము హవ్వల వలె మనం దేవునికి దూరంగా జీవిస్తాము. చెడు ఎంపికలు చేసుకునేలా సాతాను మనల్ని ప్రలోభపెడతాడు. ఈ శోధనలు మనల్ని పరీక్షించడానికి మరియు ఒప్పు మరియు తప్పులను ఎంచుకోవడానికి అనుమతిస్తాయి (ఆల్మా 12:24 చూడండి). పాపం చేసి, పశ్చాత్తాపపడని ప్రతిసారి, మనం పరలోకపు తండ్రికి దూరంగా ఉంటాము. కానీ మనం పశ్చాత్తాపపడితే, పరలోకంలో ఉన్న మన తండ్రికి దగ్గరవుతాము.

భౌతిక మరణము

చిత్రం
శ్మశానవాటిక

భూమి మన కోసం సృష్టించబడింది ( 1 నీఫై 17:36 లో చూడండి). ఆదాము హవ్వలు పిల్లలను కలిగి ఉండాలనే దేవుని ఆజ్ఞను అమలు చేయడాన్ని పతనం సాధ్యం చేసింది, తద్వారా మనం భౌతిక శరీరంలో భూమికి రావడానికి వీలు కల్పించింది. మన శరీరాలు ఏదో ఒకరోజు చనిపోతాయి, కానీ మన ఆత్మలు జీవిస్తూనే ఉంటాయి. మనం పునరుత్థానం చేయబడినప్పుడు మన శరీరాలు మరియు ఆత్మలు తిరిగి కలుస్తాయి.

యేసు క్రీస్తు ద్వారా రక్షించబడ్డారు

చిత్రం
యేసు క్రీస్తు పునరుత్థానం

పునరుత్థానం హ్యారీ ఆండర్‌సన్ చేత

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి ద్వారా, మనం భౌతిక మరియు ఆత్మీయ మరణాన్ని అధిగమించగలము. క్రీస్తు పునరుత్థానం చేయబడినందున, ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ పునరుత్థానం చేయబడతారు మరియు శాశ్వతంగా జీవిస్తారు. క్రీస్తు మన పాపాల కోసం బాధపడ్డారు కాబట్టి, మనము పశ్చాత్తాపపడి క్షమించబడగలము, తద్వారా మనము మన తండ్రితో మరల పరలోకంలో జీవించగలము.

ముద్రించు