లేఖనములు
మొరోనై 2


2వ అధ్యాయము

పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించుటకు పన్నెండుమంది నీఫైయ శిష్యులకు యేసు అధికారమునిచ్చెను. సుమారు క్రీ. శ. 401–421 సం.

1 ఆయన ఎన్నుకొనిన ఆయన యొక్క పండ్రెండుగురు శిష్యులపై తన చేతులను ఉంచి, వారితో క్రీస్తు పలికిన మాటలివి—

2 ఆయన వారిని పేరు పెట్టి పిలిచి, ఇట్లు చెప్పెను: మీరు నా నామమందు బలమైన ప్రార్థనలో తండ్రికి ప్రార్థన చేయవలెను; మీరు దీనిని చేసిన తరువాత మీ చేతులను ఎవరిపైన ఉంచెదరో, అతనికి మీరు పరిశుద్ధాత్మనిచ్చుటకు శక్తిని కలిగియుందురు మరియు నా నామమందు మీరు దానిని ఇవ్వవలెను, ఏలయనగా నా అపొస్తలులు ఆ విధముగా చేయుదురు.

3 ఇప్పుడు, క్రీస్తు వారికి మొదట ప్రత్యక్షమైన సమయమున ఈ మాటలు చెప్పెను; సమూహము వాటిని వినలేదు, కానీ శిష్యులు వాటిని వినిరి మరియు వారు తమ చేతులనుంచిన వారందరిపైకి పరిశుద్ధాత్మ వచ్చెను.

ముద్రించు